-రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి
-చంద్రబాబు సారథ్యంలో ఏపి అభివృద్ధి బాట
-టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకు
-ఎడ్యుకేషన్ హబ్గా నవ్యాంధ్రప్రదేశ్
-భవిష్యత్తులో ప్రకాశం పరిశ్రమలతో వెలుగొందుతుంది
ఒంగోలు, మేజర్న్యూస్ : శాసన మండలీలో కూడా టీడిపి ఎమ్మెల్సీలు ఉన్నప్పుడే రాష్ట్రం ఇంకా శర వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో రానున్న చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికల్లో టీడిపి అభ్యర్ధులను గెలిపించాల్సిందిగా రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖామంత్రి శిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. గురువారం నగర పరిధిలోని రైజ్, పేస్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లా డుతూ రాష్ట్ర విభజన జరిగి, ఆర్ధిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న నూతన ఆంధ్ర ప్రదేశ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నా డన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల ఆర్ధికోన్నతికి కృషి చేస్తున్నారన్నారు. ఆయన సారథ్యంలో ప్రతీ జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో అనేక పరిశ్రమల ఏర్పాటుకు సన్సిద్ధంగా ఉన్నాయన్నారు. త్వరలో దొనకొండ పారిశ్రామిక కారిడార్ రూపుద్దుకుంటుందని, రామాయపట్నం పోర్టు విషయంలో సీఎం నోటీసులో ఉందని పేర్కొన్నారు.
జిల్లాలో మైన్స యూనివర్శిటీ నెలకొల్పనున్నారని తెలిపారు. వీటితో పాటు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రకాశం జిల్లాకు రానున్నాయన్నారు. రాష్ట్రాన్ని ఎడ్యూకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు సీఎం ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. ఇంకా రాష్ట్రం శరవేగంగా చంద్రబాబు సారథ్యంలో అభివృద్ధి జరగాలంటే శాసన మండలీలో కూడా తెలుగు దేశం ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఉండాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 9వ తారీఖున జరగనున్న చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడిపి అభ్యర్ధులు పట్టాభి రామిరెడ్డి, వాసుదేవ నాయుడు ఎన్నికల బరిలో ఉన్నారని, వారి ఓటు వేసి ఏపి అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను మంత్రి శిద్ధా రాఘవరావు కోరారు. ఈ కార్యక్రమంలో రైజ్ కళాశాల కరస్పాండెంట్ శిద్ధా హనుమంతురావు, ప్రిన్సిపల్ రంగమన్నార్, పేస్ కళాశాల బృందం వీరాంజనేయులు తదితరులు ఉన్నారు.