అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు విచారణను ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డికి ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. లండన్ వెళ్లేందుకు అనుమతించాలంటూ గాలి పెట్టుకున్న పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు లండన్ వెళ్లేందుకు అనుమతించాలని పాస్ పోర్టును ఇప్పించాలంటూ గాలి పిటిషన్ పెట్టుకున్నారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు అనుమతిని నిరాకరించింది. విచారణ సందర్భంగా సీబీఐ తన వాదన వినిపించింది. గాలిని లండన్ కు అనుమతిస్తే విజయ్ మాల్యా మాదిరి లండన్ నుంచి తిరిగిరారని వాదనలు వినిపించింది.