చెన్నై : తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. కోవిలంబాక్కమ్ ఏరియా, కొరట్టూరు, చెన్నై ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షంతో రోడ్లపైకి నీరు చేరింది. కాలనీల్లోకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.