ట్రెండింగ్
Epaper    English    தமிழ்

5,6 తేదీల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య ఏపి లో పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 01, 2017, 12:32 PM

భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నవంబర్‌ 5,6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. నవంబర్‌ 5న ప్రత్యేక విమానంలో 9:30 గంటలకు గన్నవరం విమానశ్రయంకు చేరుకొని 10 గం టలకు ఆత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్టుకు చేరకుంటారు. పది గంటల నుంచి 11 గంటల మధ్య జరిగే మెడికల్‌ క్యాంప్‌లో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. నవంబరు 6న 8:30 గంటలకు స్వర్ణ భారత్‌ ట్రస్టు నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. 9:40 గంటలకు ప్రత్యేక విమానంలో రాజమండ్రికి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.11:50


నిమిషాకులు రాజమండ్రిలో బయలుదేరి 12:20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. 12:30 గంటలకు స్వర్ణ భారత్‌ ట్రస్టుకు చేరుకుని అక్కడే భోజనం చేస్తారు. 6 గంటలకు స్వర్ణ భారత్‌ ట్రస్టు నుంచి రోడ్డు మార్గం గుండా పిడబ్ల్యూడి గ్రౌండ్‌లో జరిగే కోటీ దీపోత్సవానికి వెళతారు. రాత్రి 7:55 గంటలకు విజయవాడలో బయలుదేరి తిరిగి గన్నవరం ఆత్కూరులోని స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com