విజయవాడలో శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపు తప్పి జనం మీదికి దూసుకుపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గవర్నర్పేట డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు గన్నవరం వాంబే కాలనీనుంచి బస్టాండ్కు వెళ్తున్న సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. బుడమేరు వంతెన వద్దకు చేరుకోగానే అనూహ్యంగా బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు ఒక్కసారిగా జనంపైకి దూసుకుపోయింది.బస్సు కింద నలిగిపోయి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో నలుగురు ఆస్పత్రి పాలయ్యారు. ఇదే ఘటనలో ఓ ఆటో, మరో నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. మృతులు కురిషేద్(40), హుర్షా(12)గా గుర్తింగారు. మృతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. ప్రమాద బీభత్సాన్ని చూసి ఆగ్రహావేశాలకు గురైన స్థానికులు...సిటీ బస్సును తగులబెట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు..కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.