సినీనటుడు డాక్టర్ ఎం.మోహన్ బాబు బావమరిది, శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్టీ కోశాధికారి మేడసాని వెంకటాద్రినాయుడు (55) సోమవారం రాత్రి గుండె పోటుతో మృతి చెందాడు. చంద్రగిరి మండలం నారావారిపల్లెకు చెందిన ఈయన, సినీ నటుడు డాక్టర్ మోహన్బాబు చెల్లెలు విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. మోహన్బాబు నటించిన కొన్ని సినిమాలకు నిర్మాత గానూ వ్యవహరించారు. ఈయన మృతి విషయం తెలియగానే నారావారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారావారిపల్లెలో మంగళవారం సాయంత్రం నాలు గు గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.