అనంతపురం: సినీనటి పూనం కౌర్ అనంతపురం జిల్లాలో సందడి చేశారు. చేనేత పరిశ్రమ ప్రభుత్వ ప్రచారకర్తగా ఉన్న నటి అనంత జిల్లాలోని సోమందేపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె నేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ రోజు పూనం పుట్టినరోజు కావడంతో విద్యార్థులు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.