తుముకూరు : కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రక్కులోని కోడిగుడ్లు రోడ్డుపాలయ్యాయి. అయితే ఈ ఘటన అనంతరం స్థానికులు పెద్దసంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకొని కోడిగుడ్లను ఏరుకుపోవడం కనిపించింది. ఈ ప్రమాదంలో రూ.6 లక్షల విలువైన కోడిగుడ్లు రోడ్డుపాలయ్యాయని ట్రక్కు డ్రైవర్ తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.