మెరుగైన పాలన కోసం అంతర్జాతీయ స్ధాయిలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెబుతున్న పాలకుల మాటలు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితవుతున్నా యని సిపిఎం నేత బాబు రావు అన్నారు.విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ... ప్రజా రాజధాని కాస్తా కార్పోరేట్ , ప్రైవేట్ రాజధానిగా ప్రభుత్వం నిర్మిస్తుందని ఎద్దెవ చేశారు.రాజధాని నిర్మాణానికి సేకరించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కారుచౌకగా దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.మూడేళ్ల పాలనలో కనీసం భవణాల డిజైన్లు కూడా పూర్తి చేయ్యకుండా ప్రజాభిప్రాయసేకరణ అంటూ హడావుడి చేస్తున్నారని అన్నారు.ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజాప్రతినిదులు తీరు మార్చుకొవాలని అన్నారు.