తిరుమల : వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండాయి. వైకుంఠం వెలుపుల 2 కి.మీ మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గంలో జారీ చేసే 20 వేల దివ్య దర్శనం టోకెన్లు కూడా పూర్తయ్యాయి. అధిక రద్దీతో గదులు లభించక ఉద్యానవనాల్లో భక్తులు సేదతీరుతున్నారు. మరోవైపు గదుల కేటాయింపు కేంద్రాల వద్ద భక్తులు గంటల తరబడి వేచి ఉంటున్నారు. తితిదే జేఈవో శ్రీనివాసరాజు భక్తుల క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు అవసరమైన అన్న పానీయాలను నిరంతం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.