ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లైన 5 నెలలకే యువకుడి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 19, 2022, 03:36 PM

మతిస్థిమితం లేని యువతితో పెళ్లి చేసి మోసం చేశారని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనపై, తన కుటుంబ సభ్యులపైన దౌర్జన్యం చేసి కేసులు పెట్టారని, భార్య తరఫు బంధువులు వేధించారని సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది.
ముదిరాజ్‌నగర్‌కు చెందిన షేక్‌ హుస్సేన్‌ బాషా (24 ఓ మార్కెటింగ్‌ సంస్థలో పని చేస్తున్నాడు. అతనికి కల్లూరు ఎస్టేట్‌కు చెందిన హుస్సేన్‌బీ కుమార్తె షాహీన్‌తో 5 నెలల క్రితం వివాహమైంది. పెళ్లి జరిగిన వారం రోజుల నుంచే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. పలుమార్లు పెద్దలు పంచాయితీ చేసి సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే షాహీన్‌ భర్తతో మళ్లీ గొడవపడి 3 నెలల క్రితం తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఇటీవల షాహీన్‌ దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కౌన్సెలింగ్‌కు పిలిపించడంతో హుస్సేన్‌బాషా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
గురువారం కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి అర్ధరాత్రి తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అతని తండ్రి నబిసాహెబ్‌ తెల్లవారుజామున గుర్తించి ఉరి నుంచి తప్పించి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య తరఫు బంధువుల వేధింపులు తాళలేకనే తన కుమారుడు సూసైడ్‌ లెటర్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ రామయ్య తెలిపారు. సూసైడ్‌ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భార్య తరఫు బంధువులు అమీన్‌బాషా, మాసూంబీ, షేక్షా, షాషా, మైమూన్, ఆశ వేధించారని, తన చావుకు కారకులు వీరేనని షేక్‌ హుస్సేన్‌ బాషా సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ లెటర్‌ రాశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com