తిరుమల: తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచిఉన్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 76,576 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,930 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 1.92 కోట్లుగా ఉంది.