మద్దికెర మండల కేంద్రమైన మద్దికెర పీహెచ్సీ ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం సీఐటీయు ఆధ్వర్యంలో వైద్యశాల సూపర్వైజర్ రామ్మోహన్ కు ఆశా వర్కర్స్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి గోపాల్ మాట్లాడారు.
ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం నెలకు రూ. 26 వేలు చెల్లించాలని కోరారు. ముఖ్యంగా ప్రైవేటీకరణ ఆపుతూ. వారిని పర్మినెంట్ చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్ని ఆశావర్కర్లకు అందే విధంగా చూడాలన్నారు.