తమిళనాడు: తమిళనాడులోని నాగపట్టినమ్లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. పొరయూరులో ఆర్టీసీ బస్సు డిపో గ్యారేజీ కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా..మరో 12 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్యూ టీం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భవనశిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.