న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటించేందుకు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ బయల్దేరారు. రెండు రోజుల పాటు ఆమె అక్కడి త్రివిధ దళాల సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి సైనిక కుటుంబాలను కలుసుకుని యోగక్షేమాలు తెలుసుకోనున్నారు. భారత సైన్యం సన్నద్ధతను సమీక్షించడంతో పాటు భద్రతా పరమైన పలు అంశాలపై ఆమె అధికారులతో చర్చించనున్నట్టు సమాచారం. సైనిక కార్యాచరణ ప్రాంతం, కార్ నికోబార్ వైమానిక స్థావరాలను కూడా నిర్మలా సీతారామన్ సందర్శించనున్నట్టు చెబుతున్నారు.