ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరెస్సెస్ నాయకుడి హత్యను ఖండించిన రాహుల్ గాంధీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2017, 03:48 PM

ఆరెస్సెస్ కార్యకర్తలపై పలుచోట్ల జరుగుతున్న దాడులను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. సంఘ్ నేత రవీందర్ గోస్వామిని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు నిన్న ఉదయం లూథియానాలో హత్య చేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా రాహుల్ స్పందించారు. గోస్వామి హత్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. హింసను ఎవరు ప్రేరేపించినా తప్పేనని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ సామరస్యంగా మెలగాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com