ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదు: వైవీ సుబ్బారెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2017, 02:07 PM

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరినంత మాత్రాన వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జగన్ పాదయాత్రపై ఈ పార్టీ ఫిరాయింపు ఎలాంటి ప్రభావం చూపబోదని చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా స్పందించారు. పోలవరం కాంట్రాక్టర్లను కాపాడేందుకు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని చెప్పారు. అంచనా వ్యయాన్ని పెంచడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని... ఈ మేరకు తాము ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను కోరతామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com