క్వెట్టా: పాకిస్థాన్లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు మృతిచెందారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ పేలుడు ఘటన క్వెట్టా-సిబ్బి రోడ్డుపై ఉన్న సారియబ్ మిల్ ప్రాంతంలో జరిగింది. ఎలైట్ ఫోర్స్కు చెందిన పోలీసులు వాహనాన్ని టార్గెట్ చేస్తూ రోడ్డు బాంబు పేల్చినట్లు తెలుస్తున్నది. బాంబు పేలిన సమయంలో వాహనంలో సుమారు 35 మంది పోలీసులు ఉన్నారు. సెక్యూర్టీ అధికారులు బాంబు పేలిన ప్రాంతాన్ని సీజ్ చేశారు. బలోచిస్తాన్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా హింస పెట్రేగిపోతున్నది. సూసైడ్ దాడులు, పేలుళ్లతో ఇక్కడ పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. క్వెట్టాలోనే ఆగస్టు 13న జరిగిన దాడిలో.. 15 మంది చనిపోగా, జూన్లో జరిగిన దాడిలో 8 మంది పోలీసులు చనిపోయారు.