ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాల ఆలయంలో ఇవాళ విశేష పూజలు నిర్వహించారు. జ్యోతిర్లింగమైన మహాకాలేశ్వరుడికి ఇవాళ భస్మ ఆరతి సమర్పించారు. నరకచతుర్ధశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో జనం మహాకాలేశ్వరుడి దర్శనం కోసం వచ్చారు. ఉదయం నుంచే జనం బారులు తీరారు. పూజారులు శివలింగాన్ని చాలా ఆకర్షణీయంగా అలంకరించారు. జ్యోతిర్లింగాల్లో ఉజ్జయినీ మూడవది కావడం విశేషం.