ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ అధ్యక్షుడి కూతురి దారుణ హత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2017, 05:02 PM

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నగర టీడీపీ అధ్యక్షుడు నదుల రాజు ఇంట్లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆయ‌న కూతురు దీపికను దుండ‌గులు హ‌త్య చేసి ప‌రార‌య్యారు. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇప్ప‌టికి ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. నిన్న రాత్రి త‌న‌ బార్ అండ్ రెస్టారెంట్ లో త‌న కుమారుడితో క‌లిసి ప‌నులు చేసుకున్న నందుల రాజు రాత్రి 1 గంటలకు ఇంటికి వ‌చ్చారు. తన కుమార్తె దీపిక రక్త‌పు మ‌డుగులో ప‌డి ఉండడం చూసిన ఆయన.. ఆమెను ఆసుప‌త్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. కూనపరెడ్డి మణికంఠ అనే వ్యక్తితో ఆమె ప్రేమలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనూ పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com