ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమలను సందర్శించిన కేరళ సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2017, 03:28 PM

పంబ: కేరళలోని శబరిమల ఆలయాన్ని ఇవాళ ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ సందర్శించారు. ఆలయంలో ఏర్పాట్లు, వసతులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు నెలల పాటు సాగే అయ్యప్ప మండల దీక్ష కోసం భారీగా భక్తులు రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం విజయన్‌.. అక్కడి మౌళిక సదుపాయాల గురించి సమీక్ష నిర్వహించారు. భారీగా వర్షం పడుతున్నా.. సీఎం విజయన్‌ 8 కిలోమీటర్ల గుట్టను కాలినడక ద్వారా ఎక్కారు. దాదాపు 90 నిమిషాలు ఆయన కాలి నడక ద్వారా ఆలయాన్ని చేరుకున్నారు. మొదట్లో కొంత ఉద్రేకం కలిగినా.. చివరకు ఓ మంచి అనుభవం మిగిలిందన్నారు. శబరిమల సమూల ప్రక్షాళనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం విజయన్‌ తెలిపారు. నవంబర్‌ నుంచి జనవరి వరకు మండల దీక్ష భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్, ప్రధాన అర్చకుడు ఉన్నికృష్ణన్‌ నంబూద్రి కూడా సీఎంతో ఉన్నారు. అయ్యప్ప సన్నిధానంలో పుణ్యదర్శనం కాంప్లెక్స్‌, వాటర్‌ ట్యాంక్‌ కోసం సీఎం విజయన్‌ శంకుస్థాపన చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com