కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో ఓ పోలీస్ ట్రైనింగ్ సెంటర్పై సూసైడ్ బాంబర్లు దాడి చేశారు. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా, మరో 40 మంది గాయపడ్డారు. మృతిచెందిన వారిలో మహిళలు, విద్యార్థులు, పోలీసులు ఉన్నారు. దాడి జరిగిన ప్రదేశం దగ్గర సాయుధులకు, పోలీసుల మధ్య ఇంకా ఫైరింగ్ జరుగుతున్నది. పకిటా ప్రావిన్సులోని గార్డేజ్ నగరంలో ఈ ఘటన జరిగింది. ట్రైనింగ్ సెంటర్ సమీపంలో పేలుడు పదార్థులు ఉన్న కారును పేల్చారు. ఆ తర్వాత అనేక మంది సాయుధులు కాల్పులకు తెగించారు. దాడికి మాదే బాధ్యత అని తాలిబన్ ఇప్పటికే ప్రకటించుకున్నది. ప్రస్తుతం దాడి జరిగిన ప్రాంతాన్ని మూసివేశారు. ట్రైనింగ్ సెంటర కాంపౌండ్ దగ్గర రెండు కారు బాంబు పేలుళ్లు జరిగినట్లు అంచనా వేస్తున్నారు.