హైదరాబాద్ : కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి ఎక్కువైంది. జలాశయం 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం పెరుగుతుంది. శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 2,51,596 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,80,518 క్యూసెక్కులుగా ఉంది.
స్పిల్ వే ద్వారా 1,93,634 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా 72,934 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు 11 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 1350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగులు, పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటినిల్వ 210.5133 టీఎంసీలు కాగా, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు.