కర్నూలు ఎంపీ బుట్టా రేణుక(వైకాపా) తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో ఆమె తెదేపాలో చేరనున్నట్లు సమాచారం.బుట్టా రేణుక తెదేపాలో చేరనున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే తాను పార్టీ మారడం లేదని కొద్ది నెలల క్రితం ఆమె వివరణ ఇచ్చారు. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆమె వైకాపాను వీడి తెదేపాలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ తెదేపాలో చేరుతున్నట్లు ఎంపీ ప్రకటించారు.