కర్నూలు జిల్లాలో వేసవి కాలం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి. కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంచి నీటి సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం వేల కోట్లను ఖర్చు చేస్తోందన్నారు.
అధికారులు అలసత్వం వీడి నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులను చేయించాలన్నారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల జాబితా లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారి సీహెచ్ విద్యా సాగర్ తెలపడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.