ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 16, 2017, 05:31 PM

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి రాష్ట్ర ప్రభుత్వాని ఆల్టిమేటం జారీ చేశారు.డిసెంబర్ లోగా ఇచ్చిన హామీలపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని విశాఖలో ముద్రగడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాపులను బీసీల్లోకి చేర్చే అంశంపై చంద్రబాబు కాపులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో కాపులు ఉద్యమ బాట పడుతున్నా రంటే దానికి చంద్రబాబు వైఖరే కారణమని ముద్రగడ పద్మనాభం విమర్శించారు.పక్క రాష్ట్రమైన తెలంగాణాలో ఒక్కరోజులోనే పల్స్ సర్వే పూర్తి చేస్తే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.ముఖ్యంగా కాపులను బీసీల్లోకి చేర్చే అంశంపై ప్రభుత్వం స్పందించాలని లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని ముద్రగడ హెచ్చరించారు.





 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com