యూపీ : దాస్నా జైలు నుంచి ఆరుషి తల్లిదండ్రులు విడుదలైయ్యారు. కాగా ఆరుషి హత్య కేసులో తల్వార్ దంపతులపై ఆరోపణలు నేపధ్యంలో వారిని అరెస్ట్ చేశారు. ఈకేసుకు సంబంధించి నాలుగేళ్లు తల్వార్ దంపతులు జైలు శిక్షను అనుభవించారు. అనంతరం తల్వార్ దంపతులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు వారిని నిర్ధోషులుగా తీర్పును ఇచ్చిన విషయం తెలిసినదే. ఈమేరకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు దాస్నా జైలు నుంచి ఆరుషి తల్లిదండ్రులను జైలు అధికారులు సోమవారం విడుదల చేశారు.