పుణె: ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్టీఐఐ) చైర్మన్గా సోమవారం అనుపమ్ కేర్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆయన అక్కడ ఉన్న విద్యార్థులను కలుసుకున్నారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆయన నటనపై శిక్షణ తరగతులు కూడా తీసుకున్నారు. 2016 బ్యాచ్కు చెందిన విద్యార్థులు.. అనపమ్కు అక్కడున్న సమస్యలను వివరించారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు.. షూటింగ్ బడ్జెట్ను పెంచేందుకు ప్రయత్నించనున్నట్లు ఆయన చెప్పారు. 40 ఏళ్ల క్రితం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్కు ఓ విద్యార్థిగా వెళ్లాను అని, ఇప్పడు మళ్లీ అలా వెళ్లాలన్న ఉద్దేశంతో, తన రాక గురించి ఎవరికీ చెప్పలేదు అని అనుపమ్ అన్నారు. రేపు యాక్టింగ్ విద్యార్థులకు మాస్టర్క్లాస్ తీసుకోనున్నారు.