ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విషాదం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 16, 2017, 05:05 PM

ఆహ్లాదంగా సాగుతున్న ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో అనూహ్య విషాదం చోటు చేసుకుంది. తోటి ఆటగాడు బలంగా తాకడంతో ఓ గోల్‌ కీపర్‌ మృతి చెందాడు. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది. పెర్సెలా, ఎస్‌పీఎఫ్‌సీ జట్ల మధ్య ఆదివారం (అక్టోబర్ 15) ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. పెర్సెలా జట్టుకు.. చోయ్‌రుల్‌ హుడా (38) గోల్‌ కీపర్‌గా ఉన్నాడు. ఇరు జట్లూ.. ఆది నుంచే హోరాహోరీగా తలపడ్డాయి.మొదటి అర్ధ భాగం ముగియడానికి వస్తున్న సమయంలో ఎస్‌పీఎఫ్‌సీ ఆటగాళ్లు దూకుడు పెంచారు. ఈ దశలో ఆ జట్టు మిడ్‌ఫీల్డర్‌ బంతిని గోల్‌గా మలిచేందుకు ప్రయత్నించాడు. అతణ్ని అడ్డుకోడానికి రోమన్‌ రోడ్రిక్స్‌ దూసుకొచ్చాడు. ఇదే సమయంలో హుడా కూడా ముందుకొచ్చాడు. ఈ క్రమంలో హుడా, రోమన్‌ బలంగా ఢీకొనడంతో.. వెంటనే హుడా అపస్మాకర స్థితిలోకి వెళ్లిపోయాడు.


వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్ట్రెచర్‌ సాయంతో హుడాను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రి చేరుకున్న కొద్ది క్షణాల్లోనే అతడు మరణించాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం.. అదే సమయంలో హార్ట్‌ ఎటాక్‌ కూడా రావడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఊహించని పరిణామానికి ఆటగాళ్లతో పాటు, హుడా అభిమానులు నిశ్చేష్టులయ్యారు. హుడా 1999 నుంచి పెర్సెలా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com