అగర్తలా: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కమాండంట్ దీపక్ మొందల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. సోమవారం ఉదయం త్రిపురలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. దీపక్ ప్రస్తుతం బీఎస్ఎఫ్ 145వ బెటాలియన్లో పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. దుండగుల దాడిలో ఆయన తీవ్రంగా గాయపడడంతో హుటాహుటిన హెలికాప్టర్లో బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం దీపక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా ఆయనపై ఎవరు, ఎందుకు దాడి చేశారన్నది ఇంకా తెలియరాలేదు.