మంచిర్యాల జిల్లాలోని ముల్కల్ల దగ్గర గోదావరి నదిలో బెల్లంపల్లికి చెందిన ముగ్గురు యువకులు నిన్న గల్లంతైన సంగతి తెలిసిందే. యువకుల కోసం నిన్న నది అంతా గాలించినా ఫలితం లేకపోవడంతో గజ ఈతగాళ్లు ఇవాళ వెతడకం కొనసాగించారు. మునిగిపోయిన యువకుల్లో మంద అనిల్ మృతదేహం ఇవాళ దొరికింది. మిగితా ఇద్దరు యువకులు మహేశ్, వేణు మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.