ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాలో అనుమతి లేకుండా సమ్మె చేస్తే చర్యలు: డీఈవో రంగారెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 11:01 AM

కర్నూలు జిల్లాలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు అనుమతి లేకుండా సమ్మెలో పాల్గొనేందుకు వెళ్తే చర్యలు తీసుకుంటామని డీఈవో డాక్టర్ వీ రంగారెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఎంఈఓలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.


కార్మికులకు గతంలో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వేతనంగా ఇచ్చేవారని, ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రూ. 3 వేలకు పెంచిందన్నారు. పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లిస్తున్నామన్నారు.


ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని డీఈవో సూచించారు. సోమవారం గైర్హాజరయ్యే మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వివరాలు ఎంఈఓలు తనకు అందజేయాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com