ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అహోబిలంలో శరభవాహనంపై లక్ష్మీనరసింహస్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 10:52 AM

ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని అహోబిలం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎగువన జ్వాలా నరసింహస్వామి ఆదివారం శరభవాహనంపై ఊరేగారు. లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని సంహరించాక తన కోపాన్ని తగ్గించేందుకు శివుడు శరభాసురుడు అనే రాక్షసుడిని పంపించాడని, స్వామి ఆ రాక్షసుడిని చంపి కోపాన్ని తగ్గించుకున్నాడని వేదపండితులు తెలిపారు.


దీంతో బ్రహ్మోత్సవాల ఆరో రోజు శరభవాహనంపై ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమాల్లో పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహదేశికన్‌, ఈవో నరసయ్య, మఠం అధికారి సంపత్‌, ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌, వేదపండితులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com