విజయవాడ: రాయలసీమ, కోస్తాలోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. తిరుమలలో భారీ వర్ష కురిసింది. శ్రీవారి ఆలయం ప్రాంగణంతో పాటు పలు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో కండపోత వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జూపాడుబంగ్లా మండలంలోఅత్యధిక వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా పెదకూరపాడు, అమరావతి మండలాల్లో భారీ వాన కురిసింది. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వంతెనలపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్లు ట్రాపిక్లో వాహనాలు నిలిచిపోయాయి.