తిరుమల: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అమితో రాయ్ దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి,తిరుమల జేఈవో కె.శ్రీనివాసరాజు స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అమితో రాయ్ అన్నారు.