విజయవాడ: అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం ప్రారంభమైంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పురస్కారాలకు 3,991 మంది పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు, ఉన్నత విద్య, ఇంటర్, సాంకేతిక విద్య అభ్యసించిన 2,500 మందికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు అందజేస్తోంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు.