ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 15, 2017, 10:54 AM

తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలోని కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలతో పాటు, రాయలసీమ, తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఈదురు గాలులు వీస్తాయని, భారీ వర్గాల కారణంగా వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వానలకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అల్పపీడన ద్రోణి, క్యుములో నింబస్, ఉపరితల ద్రోణి తెలుగు రాష్ట్రాలపై పరుచుకుని ఉన్నాయని పేర్కొన్నారు. మరో నాలుగైదు రోజుల పాటు వీటి ప్రభావం ఉంటుందని, ఆపై వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని, చలిగాలుల తీవ్రత పెరుగుతుందని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com