కర్నూలు జిల్లా మద్యం, నాటుసారాను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 137 వాహనాలను ఈ నెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వేలం వేయనున్నట్లు సెబ్ జాయింట్ డైరెక్టర్, కర్నూలు అడిషనల్ ఎస్పీ తుహీన్ సిన్హా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మార్చి 13వ తేదీ ఆదోని, 14న ఆలూరు, 15న ఎమ్మిగనూరు, 16న కోడుమూరు, 17న పత్తికొండ సెబ్ స్టేషన్లలో వాహనాలు వేలం వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆధార్, పాన్ కార్డుతో వచ్చి తగిన రుసుం చెల్లించి సంబంధిత సెబ్ స్టేషన్లలో ఎంట్రీ పాస్ పొందాలని సూచించారు.