మహానంది క్షేత్రంలో గురువారం సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఎలక్ర్టికల్ సికింద్రాబాద్ జోనల్ ఇంజనీర్ సోమే్షకుమార్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఆలయం వద్ద వీరికి టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు అభిషేకార్చనలు జరిపారు. అనంతరం వీరిని వేదపండితులు శాల్వతో సన్మానించి, ప్రసాదాలు అందచేసారు. వీరి వెంట మహానంది ఏ. ఎస్. ఐ కృష్ణుడు పాల్గొన్నారు.