కర్నూలు జిల్లా, పెద్దకడబూరు మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామానికి చెందిన కంబళదిన్నె రంజిత్ కుమార్ (25) అనే యువకుడు గురువారం విద్యుత్ షాక్ తో మృత్యువాత పడ్డారు.ఇంట్లో స్విచ్ ఆఫ్ చేయకుండానే రంజిత్ కుమార్ కొలాయికి మోటర్ కు కనెక్షన్ ఇవ్వబోయి కరెంట్ షాక్ కు గురైయ్యాడు. ఆ సమయంలో ఇంట్లో కూడా ఎవరు లేకపోవడంతో బాదితుడు అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. చుట్టుపక్కల వారు అప్రమత్తమై చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారని అక్కడి వైద్యులు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు క్రిష్ణయ్య, ఉరుకుందమ్మ కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడి భార్య ఈరమ్మ శోకిస్తున్న తీరు అందరిని కంట తడి పెట్టింది. మృతుడికి 3 ఏళ్ల కూతురు ఉంది. విద్యుత్ షాక్ తో రంజిత్ కుమార్ హఠాన్మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.