ప్రతి శుక్రవారం లాగే అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఈ రోజు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జగన్ వచ్చేనెల 2 నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వేసిన ‘అక్రమాస్తుల కేసుల విచారణకు వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు’ పిటిషన్పై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. అయితే, ఈ పిటిషన్పై విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, జగన్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడదని సీబీఐ ఈ రోజు ఉదయం కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జగన్ తాను పాదయాత్ర తలపెట్టిన నేపథ్యంలో నవంబర్ 2 నుంచి ఆరు నెలల పాటు తన వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఇటీవల కోరారు.