జూపాడుబంగ్లా మండలములోని చంద్రయ్య కుమార్తె సిరిగిరి ఉమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటసుబ్బయ్య తెలిపారు. గురువారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడాది క్రితం ఆత్మకూరుకు చెందిన శివ అనే యువకుని 5 లక్షల రూపాయలు నగదు తులం బంగారు ఇచ్చి వివాహం చేశారు. అయితే 6 నెలల తర్వాతమళ్ళీ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు రావడంతో భర్త శివ పై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.