ఆదోని మండల పరిధిలోని పెద్దతుంబళం గ్రామం వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గయాలయ్యాయి. ఇద్దరు కోసిగి గ్రామానికి చెందిన వారుకాగా, మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరిని కర్నూలుకు తరలించామన్నారు.