కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలోని అబ్దుల్లాపురం గ్రామ పంచాయతీలో బుధవారం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు పర్యటించారు. ఎస్. డబ్ల్యు, పి. సి కేంద్రాన్ని సందర్శించి చెత్త నుండి సేంద్రియ ఎరువుల తయారీ విధానాన్ని సిబ్బందితో చర్చించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించేటట్లు చూడాలని ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఇంటి పన్ను వసూలు విధానంలో జాప్యం లేకుండా చూడాలని ఆయన తెలిపారు.