కర్నూలులో మద్యానికి బానిసై, ఆర్థికంగా చితికిపోయి ఓ పండ్ల వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీరామనగర్కు చెందిన నల్లబోతుల వెంకట శేషన్న (55) పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొంత కాలంగా వ్యాపారం మానేసి మద్యానికి బానిస కావడంతో కుటుంబం గడవని పరిస్థితి బుధవారం నందికొట్కూరు రోడ్డులోని ఓమేగా హాస్పిటలకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మూడో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కుమారుడు వినోద కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు మూడో పట్టణ పోలీసులు తెలిపారు.