కర్నూలు మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న ఐదుగురు హాకీ క్రీడాకారులు రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారు. వీరిని నగరపాలక అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్ తన చాంబర్ లో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయన్నారు.
అలాగే ఎంపికైన నేహా, నవ్య రాణి, శ్రీ అంజి, ప్రసన్న, స్వప్నలు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో జరగనున్న సబ్ జూనియర్ అంతర్ జిల్లాల హాకీ చాంపియన్స్ లో పాల్గొంటారని మున్సిపల్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ దాసరి సుధీర్ తెలిపారు. నగరపాలక మేనేజర్ చిన్నరాముడు పాల్గొన్నారు.