రోడ్డు ప్రమాదంలో కౌన్సిలర్ భర్త 13 వ వార్డు వైసీపీ ఇన్ఛార్ కాల్వ నాగరాజు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి నూనెపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై ఈ ప్రమాదం జరిగింది. వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.