అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుని మగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఆలూరు సెబ్ సీఐ ఎర్ర వెంకట్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలూరు-చిప్పగిరి రహదారిలో వాహన తనిఖీలు చేస్తుండగా ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామానికి చెందిన విక్రమ్, చిప్పగిరి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన సోము ద్విచక్ర వాహనంపై 833 కర్ణాటక మద్యం (90ఎంఎల్) ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
చిప్పగిరి మండలంలోని నేమకల్లు గ్రామానికి చెందిన వెంకటేష్ కు మద్యం సరఫరా చేస్తున్నట్లు నిందితులు చెప్పారు. దీంతో ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచగా జడ్జి జ్యోతి ఆదేశాల మేరకు నిందితులను రిమాండకు తరలించారన్నారు.