ఆదోనిలో మతిస్థిమితం లేని బాష అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పట్టణ పరిధిలోని రైల్వే పట్టాలపై ఆత్మహత్యాయత్నినికి పాల్పడగా మీద నుంచి రైలు వెళ్లడంతో రెండు కాళ్లు కోల్పోయాడు. గమనించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.