ఓర్వకల్లు మండలంలోని ఎన్. కొంతలపాడు గ్రామంలో ఈ నెల 13వ తేదీన అంతర్రాష్ట్ర వృషభాల బండలాగుడు పోటీలు నిర్వహిస్తు న్నట్లు రైతు సంఘం అధ్యక్షుడు చంద్రశేఖ రప్ప, మల్లికార్జునప్ప బుధవారం ఓ ప్రకట నలో తెలిపారు. స్థానిక అంబాసహిత యాగంటీశ్వర స్వాముల వారి తిరునాల సం దర్భంగా రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వ హించే పాల పళ్ల విభాగం వృషభాల పోటీ లలో గెలుపొందిన ఎద్దుల యజమానులకు తొలి ఐదు స్థానాలకు గాను వరుసగా రూ. 50 వేలు, రూ. 40 వేలు, రూ. 30 వేలు, రూ. 20. వేలు, రూ. 15 వేల చొప్పున బహుమతులను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల ఎద్దుల యజమానులు అదే రోజు ఉదయం 7 గంటల్లోగా రూ. 500 ప్రవేశ రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 90007 29658, 99897 13221 సెల్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.